ఘనంగా కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు

Submitted by bheemaraidu on Fri, 30/09/2022 - 12:55
The ongoing Sharannavaratri celebrations

 
గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 29 :  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పద్మశాలీయుల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గురువారం అమ్మవారు శ్రీ మూకాంబికా దేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఉదయం అభిషేకం, కుంకుమార్చన, ప్రసాదం వితరణ జరిగాయని, పద్మశాలి పట్టణ అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్, అక్కల రవి, కాడిగ రాము, పుట్ట రఘు, సుధాకర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.