కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 13:29
 Ongoing Devi Sharannavaratri celebrations.

అచ్చంపేట సెప్టెంబర్ 29. ప్రజా జ్యోతి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నల్లమల్లలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి అచ్చంపేట పట్టణంలోని భక్త మార్కండేయ ఆలయంలో గురువారం అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అదే విధంగా ఉమామహేశ్వర ఆలయంలో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దీంతో పాటు వివిధ గ్రామాలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది ప్రధానంగా భక్త మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నాలుగవ రోజు అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి అన్నంతో పూర్ణ  కుంభాభిషేకం చేశారు బతకమ్మలు కోలాటాలతో పాటు భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్త మార్కండేయ ఆలయ అధ్యక్షులు వనం పర్వతాలు మహిళా సంఘం అధ్యక్షురాలు శకుంతల పర్వతాలు ధనరాజ్ రాములు వేణు మహిళలు సాహితీ చిలువేరు శ్రావణి జంగమ్మ తిరుపతమ్మలు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్.అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్న మహిళలు.