అధికారులు సమన్వయంతో పనిచేయాలి:ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు.

Submitted by Sathish Kammampati on Thu, 15/09/2022 - 10:28
Officials should work in coordination: MPP Manhikanti Venkateshwarlu.

గుర్రంపోడ్:సెప్టెంబర్ 14(ప్రజా జ్యోతి) అధికారులు,ప్రజా ప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేసి మండలాభివృద్ధికి కృషి చేయాలని గుర్రంపోడు ఎంపీపీ,నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు  మంచికంటి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ఏర్పాటుచేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. మండలంలోని వివిధ సమస్యలు,పనుల గురించి అధికారులకు,ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేసి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారం చేయడానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మండల అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జానయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇంద్ర పల్లి హుస్సేన్,స్థానిక సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా, మండల ఎంపీటీసీలు,సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.