జెడ్పీ లో 'డాక్టర్ కేర్' ఉచిత హోమియోపతి వైద్య శిభిరం.
ఖమ్మం, మార్చి 20, ప్రజాజ్యోతి.
సోమవారం ఖమ్మం జెడ్పి హాల్ లో 'డాక్టర్ కేర్ పోసిటివ్ హోమియోపతి' ఆధ్వర్యంలో జెడ్పి కార్యాలయం సిబ్బంది కి ఉచిత వైద్య శిబిరాన్ని జెడ్పి చైర్ పర్సన్ ఎల్ కమల్ రాజు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ కేర్ వైద్యులు వై వీణశ్రీ బిపి, షుగర్ మొదలగు పరీక్షలు నిర్వహించి అక్యూట్, క్రానికల్ రుగ్మతులకు హోమియోపతి వైద్యం ప్రాముఖ్యత ను వివరిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తూ ఈ వైద్యం ప్రాముఖ్యతను ప్రజల్లో కి తీసుకువెళ్తున్నందుకు 'డాక్టర్ కేర్' సంస్థ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి వైద్యం పట్ల మరింత అవగాహనను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేర్ ఖమ్మం బ్రాంచ్ పిఆర్ఓ వి స్వాతి శ్రీ, ఫార్మాసిస్ట్ మౌనిక, జెడ్పి సీఈఓ అప్పారావు, డిప్యూటి సిఈవో చంద్రశేఖర్, జెడ్పి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- 14 views