కల్వకుర్తి,సెప్టెంబర్30( ప్రజాజ్యోతి): కల్వకుర్తి మండల పరిధిలోనిబెక్కర గ్రామంలో ఉప సర్పంచ్ గోరటి పార్వతమ్మ ఇటీవల అనారోగ్యం తో మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెరాస రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, వారి కుటుంబానికి పరామర్శించి,10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ పాండురంగ రెడ్డి, తోటపల్లి సర్పంచ్ రాజేష్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు గుమ్మకొండ రాజు, ఆమన గల్లు మార్కెట్ కమిటీ సురమల్ల సుభాష్,పరుశురాములు, జంతుక కిరణ్, వడ్డెమోని శివకుమార్, సతీష్, సుమన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- 9 views