పాలక వీది,సెప్టెంబర్28(ప్రజా జ్యోతి): ఉమ్మడి నేరేడుచర్ల మాజీ ఎంపీపీ, మార్కెట్ కమిటీ చైర్మన్, బొత్తల పాలెం గ్రామ సర్పంచిగా నిస్వార్థపూరిత సేవలు అందించిన నాయకుడు స్వర్గీయ అందె చిన్న మల్లయ్య అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పిన విజయ్ సింహారెడ్డిలు కొనియాడారు. బోత్తల పాలెం గ్రామంలో ఆయన విగ్రహ ఏర్పాటు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు, వివిధ పార్టీల నాయకులు హాజరై విజయవంతం చేశారు. చిన్న మల్లయ్య సేవలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పలువురు నాయకులు నెమరు వేసుకున్నారు. పేద ప్రజల అభ్యున్నతికి, ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు శ్రమించి, స్వప్రయోజనం కన్నా ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డారని, ఆయన అడుగుజాడల్లో నేటితరం నాయకత్వం నడవాలని జూలకంటి రంగారెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీలకతీతంగా ప్రజాభిమానాన్ని చురగొన్న గొప్ప నాయకుడు చిన్న మల్లయ్య అని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. గ్రామస్తుల కోరిక మేరకు అందే మల్లయ్య పేరు మీద గ్రామంలో గ్రంఘాలయం ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వటం జరిగింది.తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గం నుండి ఈ ప్రాంతంలో ఉత్తమ విలువలు కలిగిన నాయకుడిగా మల్లయ్య ఉండటం చేతనే రాజకీయంగా అవకాశాలు వచ్చాయని మాజీ ఎమ్మెల్యే తిప్పిన విజయ్ శివారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బారావు, ఎంపీపీ గోపాల్ నాయక్ లతోపాటు మండల పార్టీ కేడర్ పాల్గొంది. కోదాడ మున్సిపాలిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, సూర్యాపేట మాజీ మున్సిపాలిటీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, దొంగరి వెంకటేశ్వర్లు, కందగట్ల అనంత ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ శివారెడ్డి, మాజీ జెడ్పిటిసి పిడమర్తి రాజు, నేడు జిల్లా పార్టీ అధ్యక్షుడు కొనతం చిన్న వెంకటరెడ్డి, వైసీపీ పిన్నెల్లి ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ,మల్లయ్య కుమారుడు అందే రాజు కుటుంబ సభ్యులు, మోతిలాల్ నాయక్, జితేందర్ రెడ్డి తదితర పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- 2 views