హలియా,సెప్టెంబర్28(ప్రజా జ్యోతి) : దళితుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. బుధవారం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి,తిరుమలగిరి,గట్ల మల్లేపల్లి,గానుగు పల్లి,దామెర గ్రామలలో టి.ఆర్.యస్ పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యుల దళిత సమ్మేళన,వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీని దళితులు డప్పుల చప్పులతో స్వాగతం పలికారు.అనంతరం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూదళితుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని,తెరాస ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంతో దళితులను ఉపాధి రంగంలో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళుతున్నాడని చెప్పారు. దళితులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు.దళిత బంధు పథకాన్ని దశలవారీగా దళితులందరికీ ప్రభుత్వం అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో గుర్రంపూడుజడ్పిటిసి గాలి రవికుమార్ గౌడ్,తిరుమలగిరి సాగర్ మండల ఎంపీపీ భగవాన్ నాయక్,గుర్రంపొడు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రావులపాటి భాస్కర్,గానుగపల్లి సర్పంచ్ నరసింహ గౌడ్,గట్ల మల్లేపల్లి సర్పంచ్ శ్రీలత నరసింహారావు,గ్రామ పార్టీ అధ్యక్షులు,దళిత నాయకులు,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- 1 view