వంధనం మత్య్స సోసైటీని నిలుపుదల చేయాలి
ఖమ్మం, సెప్టెంబర్20 ప్రజాజ్యోతి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం వంధనం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయదలిచిన మత్స్య సహాకార సంఘాన్ని నిలుపుదల చేయాలని ఆవుల రాము గ్రామస్తులు జిల్లా మత్య్స శాఖ అధికారి ఆంజనేయులు కి ఫిర్యాదు చేశారు.మత్య్స సంఘంలో అనర్హులున్నారని స్థానికంగా కనీసం ఓటు హక్కు లేని వారిని సైతం సభ్యులుగా చేర్చారని సంఘాన్ని నిలుపుదల చేయాలని విచారణ నిమిత్తం వచ్చిన జిల్లా అధికారికి తెలిపారు. ఉసికల సురేష్ లకావత్ సత్యనారయణ నాసర్ మియా తాళ్ళ రమేష్ తదితురులు విన్నవించారు.