- వంగుర్ జయశంకర్
నాగర్ కర్నూల్ (ప్రజా జ్యోతి న్యూస్ ) న్యూఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగం నిర్మాత నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగుర్ జయశంకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కే. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ లో ఏకగ్రీవ తీర్మానం చేయడం చరిత్రత్మకమని, పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం చేసిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానికి దళితులపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని ఆయన అన్నారు. లేనిపక్షంలో బండి సంజయ్ సంఘమయాత్రను అడుగడుగునా అడ్డుకుంటామని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, సురేందర్, మోహన్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.