కనకదుర్గ ఆలయాల్లోఘనంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.

Submitted by venkat reddy on Tue, 27/09/2022 - 15:23
Navratri celebrations begin in Kanakadurga temples.

ఫోటో రైటప్ ః రాజన్నగూడెంలో కనకదుర్గమ్మ అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు
నిడమనూరు, సెప్టెంబర్26(ప్రజాజ్యోతి): 
తొమ్మిది రోజుల పాటు హిందువులు జరుపుకునే దసరా- కనకదుర్గమ్మ నవరాత్రి వేడుకలు మండలంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబర్04 వరకు నవరాత్రి వేడుకలు సాగుతాయి. దసరా మహోత్సవాలకు రాజన్నగూడెం,నారమ్మగూడెం‌,తుమ్మడం రేగులగడ్డ గ్రామాల్లోని కనకదుర్గమ్మ ఆలయం భక్తులకు మహ అద్బుతంగా దర్శనిమిస్తుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి స్వర్ణకలశ  తొలి దుర్గామాత సన్నిధిలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ నవరాత్రుల్లో దుర్గామాత తొమ్మిది అవతారాలలో దర్శనం ఇస్తుంది. సోమవారం, ఆశ్వయుజ పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమివ్వనున్నారు. సోమవారం కనకదుర్గ అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం రెండోవ రోజు బాలత్రిపుర సుందరి అవతారంలో భక్తులకు కనకదుర్గమ్మ వారు దర్శనమిస్తారు,మూడొవ రోజు గాయత్రి దేవి అలంకరణ ,నాల్గొవ రోజు అన్నపూర్ణ దేవి అలంకరణ, ఐదోవరోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ,ఆరోవ రోజు మహలక్ష్మీఅవతారం, ఏడోవ రోజు సరస్వతి దేవి,ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదొవ రోజు మహిషాసురమర్థిని అలంకరణ సాయంత్రం శివ పార్వతుల శాంతికళ్యాణం,ఉరేగింపు భక్తులను అనుగ్రహిస్తారు.

దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకోడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ఏడాది సుమారు 5వేల మంది వరకూ భక్తులు వస్తారని అంచనా అధికారులు వేశారు. అందుకు తగ్గట్టుగానే ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ముందస్తు చర్యలు తీసుకున్నారు. భక్తుల వాహనాలకు పార్కింగ్‌ ప్రదేశాలు సిద్ధం చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసశర్మ,మోహన్ శర్మ,భక్తులు రాజన్నగూడెం ఎంపిటిసి మజ్జిగపు లక్ష్మీ వెంకట్ రెడ్డి, సర్పంచ్ ముంగిజ్యోతిశివమారయ్య,ఆలయ కమిటీ సభ్యులు మజ్జిగపు దయాకర్ రెడ్డి, నాగిరెడ్డి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.