దేశం కెసిఆర్ వైపు చూస్తున్నది

Submitted by Sathish Kammampati on Wed, 07/09/2022 - 16:12
Nation is looking towards KCR

తెలంగాణలో బీజేపీ ఆట సాగదు

ఇక్కడి  పధకాలు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఉన్నాయా      

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్లగొండ సెప్టెంబర్ 07,(ప్రజాజ్యోతి) దేశ రాజకీయాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయని దేశం మొత్తం తెలంగాణ వైపు, సీఎం కెసిఆర్ వైపు చూస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.బుధవారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ..తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇక్కడ మత చిచ్చు పెట్టేందుకు కుట్ర చేస్తున్నదని,ఆ కుట్రలు ఇక్కడ సాగే అవకాశం లేదని  దేశ రైతాంగాన్ని ఏకం చేయడానికి సీఎం కెసిఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారని ఇందులో ఆయన సఫలమవుతారని తెలిపారు దేశ ప్రజలు సీఎం కెసిఆర్ నాయకత్వాన్ని ఆశిస్తున్నారని చెప్పారు. 

దేశంలోని వివిధ రాష్ట్రాల రైతు నేతలు రాష్ట్రంలో పర్యటించి ఇక్కడ పధకాలు, అమలు తీరును పరిశీలించి అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు తామంతా కెసిఆర్ నాయకత్వంలో ముందుకెళ్తామని రైతు సంఘాల నేతలు చెప్పినట్టు తెలిపారు సమ పాలనలో సంక్షేమ పధకాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఎలాంటి సమస్యలు లేకుండా వ్యవసాయ పరంగా ఆర్ధిక పరిపుష్టి ఉన్న రాష్ట్రం మనదని గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ రైతాంగానికి 24 గంటల కరెంట్ అందిస్తూ దళితులకు దళిత బంధు, వృద్దులకు వితంతువులకు, వికలాంగులకు ఆసరా పింఛన్ ఇస్తున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.