ఉన్నత శిఖరాలకు చేరుకోని ప్రాంతానికి పేరు తేవాలి... కళాశాల ప్రిన్సిపల్ సోమయ్య...

Submitted by shaikmohammadrafi on Wed, 21/09/2022 - 12:01
Name the area that does not reach high peaks...   College Principal Somaiah...

నడిగూడెం, సెప్టెంబర్ 20 ,ప్రజా జ్యోతి:  మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  2022 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వృత్తి విద్య  ఇ టి గ్రూపు నందు విద్యనభ్యసించి వార్షిక పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన బొడ్డు లిఖిత్ ను మంగళవారం కళాశాలలో అధ్యాపక  బృందం  ఘనంగా సన్మానించడంతోపాటు షీల్డ్  ను అందజేశారు. కళాశాల  ఆధ్యాపకురాలు  సుజాత ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సోమయ్య మాట్లాడుతూ లిఖిత్ భవిష్యత్తులో  మంచి విద్యని అభ్యసించి ఉన్నత స్థాయిలో  పేరు ప్రఖ్యాతలు సాధించాలని కోరారు. కళాశాల పక్షాన సన్మానించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ కు, అధ్యాపక బృందానికి లిఖిత్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లెక్చరర్స్
రాజు, మదర్, ఈశ్వర్, విద్యార్థి తండ్రి హుస్సేన్, కళాశాల సిబ్బంది రాములు, చారి, ఉపేందర్, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..