నాగార్జున సాగర్ పిసిసి ప్రతినిధిగా ముంగిశివమారయ్య

Submitted by venkat reddy on Fri, 23/09/2022 - 10:45
 Nagarjuna Sagar PCC representative Mungishivamaraiah

ఫోటో రైటప్ ః ముంగి శివమారయ్య ఫోటో 

నిడమనూరు, సెప్టెంబర్22(ప్రజాజ్యోతి):  నాగార్జున సాగర్ నియోజకవర్గ తెలంగాణ ప్రదేశ్ పిసిసి ప్రతినిధిగా ముంగిశివమారయ్య యాదవ్ నియమితులయ్యారు. గురువారం నిడమనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ముంగి శివమారయ్య యాదవ్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా  నాగార్జున సాగర్ నియోజకవర్గ తెలంగాణ ప్రదేశ్ పిసిసి ప్రతినిధిగా ముంగి శివమారయ్య యాదవ్  నియామకానికి సహకరిచిన మాజీ సిఎల్పీ  నేత కుందూరు జానారెడ్డికి,పిసిసి అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి ,నల్లగొండ ఎంపి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డికి,యడవెల్లి రంగశాయి రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ తెలంగాణ ప్రదేశ్ పిసిసి ప్రతినిధిగా ముంగి శివమారయ్య యాదవ్ కు.ఎంపికైనందుకు  పలువురు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు .ఆయన వెంట నిడమనూరు జెడ్పిటిసి నందికొండ రామేశ్వరి మట్టారెడ్డి, నిడమనూర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు అంకతి సత్యం,రాజన్నగూడెం ఎంపిటిసి మజ్జిగపు లక్ష్మీ వెంకట్ రెడ్డి,మేరెడ్డి వెంకట్ రాహుల్ , యువజన కాంగ్రెస్ అద్యక్షుడు నర్సింగ్ విజయ్ కుమార్ గౌడ్,కాంగ్రెస్ యూత్ నాయకులు యడవెల్లి వల్లభరెడ్డి,పిఏసిఎస్ డైరెక్టర్ మజ్జిగపు దయాకర్ రెడ్డి, దేవిరెడ్డి నాగిరెడ్డి, తదితరులు ,పాల్గొన్నారు.