ములుగు జిల్లాను పోషకాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 09:46
Mulugu district should be made a malnutrition free district

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి): ములుగు జిల్లాను పోషకాహారలోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి సూచించారు.బుధవారం ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటిడిఏ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మహోత్సవం,2022 బతుకమ్మ సంబరాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కృష ఆదిత్య,ఐటిడిఏ పివో అంకిత్ లతో కలిసి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ మహిళా రక్షణ,శిశు,కిషోర బాలికల, బరువు పెంచడం,పోషణ సంక్షేమం, జిల్లాలో పోషణ అభియాన్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సందర్భంలో అంగన్వాడీ పిల్లల పోషకాహారం వంటిపలు అంశాలపై అధికారులతో సమీక్షించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లు సాంప్రదాయ ఆహరం ఏర్పాటు చేసి వాటి విశిష్టతను స్టాల్ ద్వారా ఏర్పాటు చేసి సభ్యులకు వివరించారు. వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలను తయారు చేశారు.అట్టి బతుకమ్మలను చైర్ పర్సన్ తిలకించారు.చైర్ పర్సన్ మాట్లాడుతూ 65% మంది మహిళలు రక్తహీనతో బాధపడుతున్నారని, గర్భిణీ లలో 51% సమస్య ఎదుర్కొంటున్నారని అన్నారు.మహిళలు ఆకు కూరలు,పౌష్టి కాహారం తీసుకోవాలని సూచించారు. పుట్టిన పిల్లలకు వెంటనే ముర్రుపాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.పిల్లల ఎదుగుదలఆరోగ్యానికి పోషకాహారం తప్పనిసరని,చిన్నారుల ఆరోగ్యంపై ప్రతేక్య శ్రద్ధ వహించాలని,  1000 రోజుల ప్రణాళిక ఆవశ్యకతను వివరించారు.మహిళల్లో రక్తహీనత నుండి విముక్తే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పని చేస్తుందని,ఈ దిశగా విజయం సాధిస్తూ ముందుకెళ్లడం అభినందనీయమని అన్నారు.

రక్తహీనత ఉన్న వారికి సరైన పోషకాహారం అందించడం,ఐరన్ మాత్రలు ఇవ్వడం వంటి వాటి ద్వారా రక్తహీనతను అరికట్టవచ్చని తెలిపారు.  అడవితల్లి అందాలను మహిళల గురించి వివరించిన పాటలను డిడబ్ల్యుఓ.సిడిపిఓ లను, సూపర్వైజర్లను,అంగన్వాడి టీచర్లను ఆమె అభినందించారు.రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సహకారంతో  జిల్లాలో అంగన్వాడీ సెంటర్లను నూతనభవనాలను తీర్చిదిద్దుకుంటున్నామని అన్నారు.జిల్లా కలెక్టర్ వివరించినట్లుగా జిల్లాలో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించడానికి ప్రణాళిక బద్ధంగా కృషిచేస్తామని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి చురుకుగా పనిచేస్తున్నారని,ఈ జిల్లాలోనిసమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని తెలిపారు.గిరిజన పిల్లల విద్య కోసం ఆశ్రమ పాఠశాలలు,ఆరోగ్య  క్షేమం కోసం పౌష్టికాహారం రాష్ట్రప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తహీనత వల్ల మహిళల్లో అనేక దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని అన్నారు.జిల్లాలో 646 అంగన్వాడి సెంటర్లు ఉన్నాయని అన్నారు.జిల్లాలో అంగన్వాడీ సెంటర్లలో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని వివరించారు.జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులు షహీన్ ఆఫ్రోజ్,కొమ్ము ఉమాదేవి,గద్దల పద్మరేవతి,కృష్ణకుమారి,ఈశ్వరి బాయి, అదనపు కలెక్టర్ వైవి గణేష్,వైద్య అధికారి అప్పయ్య,ఈఈ హేమలత,సీడీపీఓలు హేమలత,మల్లీశ్వరి,ముత్తమ్మ సూపర్ వైజర్లు,అంగన్వాడీ టీచర్లు,స్టాఫ్, తదితరులు పాల్గొన్నారు.