ఆశా కార్యకర్తలకు చీరలు పంపిణీ చేసిన ఎంపీపీ,జెడ్పీటీసీలు.

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 10:43
MPP, ZPTC distributed sarees to Asha workers.

గుర్రంపోడ్:సెప్టెంబర్ 19(ప్రజా జ్యోతి)../.  గుర్రంపోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు.ఈ సమావేశంలో గుర్రంపోడు ఎంపీపీ, నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు,గుర్రంపోడు జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్ లు పాల్గొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది డిప్యూటేషన్ ద్వారా వెళ్లడం వల్ల సిబ్బంది కొరత ఏర్పడిందని వైద్యాధికారి ఎంపీపీ దృష్టికి తీసుకురాగా ఈ విషయంపై ఎమ్మెల్యే నోముల భగత్ దృష్టికి తీసుకువెళ్లి లేని సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.అనంతరం ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు,జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్ లు మండలంలోని ఆశా కార్యకర్తలకు చీరలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి నవనీత,వైద్యుడు శివకాంత్,మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య,చామలేడు తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు పగిళ్ళ రమేష్, ఆరోగ్య కేంద్రం సిబ్బంది,మండల ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.