ప్రజా జ్యోతి నాగారం 26సెప్టెంబర్.../// నాగారం మండల కేంద్రంలోని పేరబోయిన గూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ కూరం మణి,వెంకన్న ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూప్రతి సంవత్సరం తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగ సంతోషముగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని తెలిపారు .అదే విధంగా షాదీ ముబారక్ ,కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది 300 కోట్లు బతుకమ్మ చీరలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిగుళ్ల స్వరూప ప్రశాంత్, మండల కార్యనిర్వాహక కార్యదర్శి ఉప్పుల జానకి, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, విబికె నాగమణి, వర్డ్ మెంబర్ కంచుగట్ల లింగయ్య, చింతల మాకమల్లు, పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, ఉప్పుల రామ్మూర్తి, దొడ్డి ప్రేమయ్య, తదితరులు పాల్గొన్నారు.
- 4 views