లింగయ్య మృతికి ప్రగాఢ సంతాపం తెలిపిన ఎంపీ రాములు.

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 13:58
 MP Ramulu condoled the death of Lingaiah.

అచ్చంపేట సెప్టెంబర్ 23 ప్రజాజ్యోతి. బల్మూరు మండలంలోని కొండనాగుల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సలెమ్మ భర్త కాట్రాజు లింగయ్య టీచర్ అనారోగ్యంతో మృతి చెందారు కాగా శుక్రవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు కొండనాగుల గ్రామానికి చేరుకొని లింగయ్య మృతదేహానికి పుష్పగుచ్చాలు ఉంచి ప్రగాఢ సంతాపం తెలిపారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు అదేవిధంగా ఆ కుటుంబానికి ఎంపీ రాములు కొంత ఆర్థిక సహాయం అందజేశారుఆయన వెంట నాయకులు చంద్రమోహన్ తిరుపతిరావు సుదర్శన్ రావు ఉపసర్పంచ్ యూనుఫ్ తదితరులు ఉన్నారు.

బిజెపి నాయకులు పరామర్శ

బల్మూరు మండలంలోని కొండనాగుల గ్రామ మాజీ సర్పంచ్ సలెమ్మ భర్త కాట్రాజు లింగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు శుక్రవారం అచ్చంపేట బిజెపి నాయకులు శ్రీకాంత్ భీమా నాయకులతో కలిసి మృతదేహానికి పుష్ప కుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు పెద్దయ్య నాయకులు ఉన్నారు