బతుకమ్మ చీరల పంపిణీ చేసిన ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 11:00
MP Karnati Swamy Yadav distributed the Bathukamma sarees

మునుగోడు సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి):  బతుకమ్మ పండుగసందర్భంగా గ్రామ గ్రామాన బతుకమ్మ చీరలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నట్లు ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ తెలిపారు శుక్రవారం మండల పరిధిలోని వివిధగ్రామపంచాయతీ ల వద్ద ఆడపడుచులకు స్థానిక మండల ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తో కలిసి చీరల పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్వామి యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలయం అన్నారు బతుకమ్మ పండుగను మహిళలు ఆత్మగౌరవంతో జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కొంపెల్లి సర్పంచ్ జాల వెంకన్న యాదవ్ , కల్వకుంట్ల సర్పంచ్ పగిళ్ల బిక్షమయ్య , మరియు ఆయా గ్రామాల సర్పంచులు, సిహెచ్ వెంకట్ రెడ్డి, కర్నాటి మహేశ్వరి ఊసయ్య గౌడ్ , తాటికొండ సంతోష సైదులు, జాజుల పారిజాత , తదితరులు పాల్గొన్నారు