సల్మాన్ రాజు మృతికి ఎంపీ నామ సంతాపం

Submitted by Satyanarayana on Tue, 13/09/2022 - 18:27
MP condoles the death of Salman Raju

ఖమ్మం, సెప్టెంబర్ 13ప్రజాజ్యోతి . ఖమ్మం నగరంలోని 22వ వార్డు కార్పొరేటర్ పల్లా రోస్ లీనా భర్త పల్లా సల్మాన్ రాజు హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. నామ మంగళవారం ఫోన్ లో సల్మాన్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి, తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని నామ ఆకాంక్షించారు.