కల్యాణ లక్ష్మి షాది ముబరకు చెక్కులను అసరా పించన్ లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అబ్రహం.

Submitted by sridhar on Mon, 05/09/2022 - 16:57
MLA Abraham distributed the checks to Kalyana Lakshmi Shadi Mubara and Asara Pinchan
  • జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరిత .

(ప్రజా జ్యోతి)సెప్టెంబర్ 5.అలంపూర్: మానవపాడు మండల ప్రజా పరిషత్ ఆఫీస్ నందు వివిధ గ్రామాల వారికి 1031 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులు మరియు 26 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబరకు చెక్కులను పంపిణీ చేశారు.
   ఈ సందర్భంగా ఎమ్మేల్యే  మాట్లాడుతూ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 36 లక్షల మందికి అన్ని రకాల పెన్షన్లను అందిస్తుందని,

మరో 10 లక్షల మందికి నూతన పెన్షన్లను లబ్ధిదారులకు మంజూరు చేసిందని అన్నారు.

అలంపూర్ నియోజకవర్గానికి  చెందిన 8864  నూతన పెన్షన్ లు మంజూరు అయ్యాయని అన్నారు.

త్వరలో అర్హులైన వారందరికీ పెన్షన్ లు మంజూరు అవుతాయని తెలిపారు.,అర్హులైన వారందరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గొప్ప సాహసం దాతృత్వం కూడిన ఆలోచన 50 లక్షల మంది అభాగ్యులైన వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఒంటరి మహిళలలకు ఆసరా పెంక్షన్లను అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.

 సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి మూడు లక్షల రూపాయలు పంపిణీ చేసే పథకానికి దసరా తర్వాత సిఎం.కేసీఅర్  శ్రీకారం చుట్టనున్నారని ఎమ్మెల్యే  ఈ సందర్భంగా తెలిపారు.,_

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు,టీఆర్ఎస్ నాయకులు,ఆసరా పెన్షన్ లబ్ధిదారులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.