17 న జాతీయ జెండాను ఆవిష్కరించ నున్న మంత్రి ఎర్రబెల్లి

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 13:15
Minister Errabelli will unveil the national flag on the 17th

జనగామ, సెప్టెంబర్ 15, ప్రజాజ్యోతి :-  రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా  నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఈ నెల 17 న జాతీయ జెండాను  రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, త్రాగునీటి సరఫరా శాఖ  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ఈనెల  17న ఉదయం 9.00 గంటలకు  కలెక్టర్ కార్యాలయం లో జాతీయ జెండాను  ఆవిష్కరిస్తారని  జిల్లా కలెక్టర్ సి.హెచ్ . శివ లింగయ్య  గురువారం ఒక ప్రకటనలో  తెలిపారు.
తెలంగాణ. జాతీయ సమైక్యత దినోత్సవ వేడుక నిర్వహణకు  నియమించబడిన ఉన్నత  అధికారులు, కలెక్టరేట్ ఆఫీస్ సిబ్బంది , వివిధ శాఖల సిబ్బంది  అందరు ఈనెల 17 న ఉదయం 8.00  గంటలకు కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో నిర్వహించే వేడుకలకు  తప్పక హాజ రై  విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.