వనభోజనాల జన సమీకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Submitted by Sathish Kammampati on Sun, 25/09/2022 - 13:15
The mass mobilization program of Vanabhojana should be successful

టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే

నాంపల్లి సెప్టెంబర్ 24(ప్రజా జ్యోతి )..//..ఈనెల 26న నిర్వహించే టిఆర్ఎస్ పార్టీ నాంపల్లి మండల స్థాయి కుటుంబ సభ్యుల వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య,ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి  పిలుపునిచ్చారు. శనివారం రోజు మండల కేంద్రంలోని స్థానిక నక్క సునంద ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ నెల 26న నాంపల్లి మండల స్థాయి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల వనభోజనాల కార్యక్రమం ఉంటుందని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వనభోజనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మునుగోడులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రెండు జాతీయ పార్టీలకు ఓటమి తప్పదని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్, బిజెపి లకు చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకునే తెలంగాణ సాధించామని, మునుగోడులో తెరాసను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. విప్లవ ఉద్యమాలకు నిలయంగా ఉన్న నల్లగొండ జిల్లాలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఘనత రాజగోపాల్ రెడ్డి, చెల్లుతుందని  ప్రజల తీర్పు ఉండబోతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో  జెడ్పిటిసి వెలుగోటి,వెంకటేశ్వర్ రెడ్డి,  రైతుబంధు సమితి కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బొల్లంపల్లి వెంకటేశ్వర్లు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీశైలం యాదవ్ ,తెరాస మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడపు నరసింహారావు  టిఆర్ఎస్ నాయకులు పానగంటి వెంకన్న గౌడ్,సర్పంచులు  జెల్లెల్ల యాదమ్మ  సైదులు, బాషిపాక రాములు, గుండాల అంజయ్య , దండి నర్సింహా,దేవేందర్ సత్యనారాయణ,నాంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు నాంపల్లి సత్తయ్య, గౌర్ సందీప్,వడ్త్యా హనుమంతు, లచ్చిరామ్,మేఘవత్ హనుమంత్, దీప్ల నాయక్, వివిధ గ్రామాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.