ప్రజా జ్యోతి క్రైమ్ సూర్యాపేట 26సెప్టెంబర్//;;; సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది అత్త మామ వేధింపులు తాళలేక ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా గాజులంక గ్రామానికి చెందిన సనక వాసవి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వాసవి భర్త సనక శ్రీకాంత్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్బిఐ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆడపిల్లలు పుట్టారని అదనపు కట్నం తెమ్మని అత్త మామ వేధిస్తుండడంతో మానసిక సంఘర్షణకు లోనై వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. వివాహిత ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట డిఎస్పి నాగభూషణం తెలిపారు.
- 2 views