బీజేపీలో పలువురి చేరికలు

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 14:26
Many people joined BJP

వెంకటాపురం ( నూగూరు) సెప్టెంబర్ 16( ప్రజా జ్యోతి)// ములుగు జిల్లా ,వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామ పంచాయతీకి చెందిన ఇరవై కుటుంబాలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారు బిజెపిలో చేరడం జరిగింది.వారికి బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సతిష్ కుమార్ ఎంపిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్రమోదీ నాయకత్వంలో 19 రాష్ట్రలల్లో భాజపా సుపరిపాలన సాగుతుందని రాబోయే రోజుల్లో 20వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రమేనని, రాష్ట్రంలో నిరంకుశ పాలనకు అంతం పలుకుతూ బీజేపీలోకి చేరికలు మొదలయ్యాయని అన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చ  నాయకులు త్రినాథరావు, మరికాల ఎంపీటీసీ లక్ష్మీశేఖర్, మట్టి రమేష్, చెరుకుల సర్వేశ్, కుచింటి చందర్ రావ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.