గద్వాల జిల్లా (ప్రజాజ్యోతి ప్రతినిది) ఆగస్టు 31 : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల ప్రజలకు ఎస్సై ఆర్.శేఖర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.సకల శాస్త్రాలకు అధిపతిగా,బుద్ధికి,జ్ఞానానికి ఆరాధ్యుడిగా ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా భక్తిశ్రద్దలతో హిందువులు ఆరాధ్యదైవంగా ఆరాధిస్తారని అన్నారు.శాంతియుతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను మండల ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని ఎస్సై ఆర్.శేఖర్ఆకాంక్షించారు.
గణనాథుని ఆశీస్సులు కలకాలం అందరిపై ఉండాలని అందరికీ మంచి ప్రసాదించాలని కోరారు.తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.నిమజ్జనంకు బయలుదేరే సమయంలో విద్యుత్ తీగల పట్ల జాగ్రత్త వహిస్తూ శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో భక్తిగీతాలు ఆలపిస్తూ నిమజ్జనంకు బయలుదేరాలని కోరారు.
- 5 views