దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు రెండు లక్షల విలువగల బైకులు, బ్యాటరీలు స్వాధీనం .ఏసీపీ రఘు చందర్

Submitted by bosusambashivaraju on Wed, 28/09/2022 - 12:45
A man accused of theft was arrested Bikes and batteries worth two lakhs seized  .... ACP Raghu Chander

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 27 ( ప్రజాజ్యోతి ) : -  వివరాల్లోకి వెళితే తేదీ 03-09-2022 రోజు శివునిపల్లి గ్రామంలోని లారీ అసోసియేషన్ వద్ద నిలిపి ఉన్న నాలుగు లారీల యొక్క ఎనిమిది బ్యాటరీలు దొంగిలించినారని పోలీసులకు భాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మంగళవారం వాహన తనిఖీలు చేపడుతుండగా మడికొండ గ్రామం ఎం ఎన్ నగర్ కాలనీకి చెందిన నిందితుడైన మానుపాటి అంజి    అరెస్టు చేసారు. అతని వద్ద  మడికొండ, పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలించబడిన రెండు ద్విచక్ర వాహనాలు , 8 బ్యాటరీలు,  దొంగతనానికి ఉపయోగించిన ఆటోను స్వాధీన పరచుకోవడమైనది  తెలిపారు . అలాగే నిందితుడికి సహకరించిన వెంకటేష్,  రవిలు పరారీలో ఉన్నారని, చోరీ చేసిన వాటి విలువ సుమారు రెండు లక్షలు రూపాయలు విలువ కలదని తెలిపారు . దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఘనపూర్ సీఐ అల్లె రాఘవేంద్ర , ఎస్సై బండి శ్రావణ్ కుమార్ , కానిస్టేబుల్ కుమారు, దేవరాజు, రవి ప్రసాద్ లను ఘనపూర్ ఏసిపి రఘుచందర్ అభినందించారు.