సంతాప సభను విజయవంతం చేయండి.. సర్పంచ్ అనసూర్యమ్మ

Submitted by shaikmohammadrafi on Sat, 24/09/2022 - 11:46
Make the condolence meeting a success..  Sarpanch Anasuryamma

నడిగూడెం సెప్టెంబర్ 23 ప్రజా జ్యోతి ..///.  భూమికోసం ,భుక్తి కోసం ,పీడిత ప్రజల విముక్తి కోసం , జరిగిన  తెలంగాణ సాయుధ పోరాటానికి రాష్ట్ర కేంద్రంగా ఉండి ,  పుచ్చలపల్లి సుందరయ్య, నండూరి ప్రసాదరావు , భీమిరెడ్డి నరసింహారెడ్డి,మల్లు స్వరాజ్యం, మాకినేని బసవ పున్నయ్య,లావు బాలగంగాధర్ లాంటి అగ్ర నేతలకు, ఆశ్రయమిచ్చిన, ప్రాంతంసూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం  రామాపురంలో సెప్టెంబర్ 24న జరిగే మాజీ సింగిల్ విండో చైర్మన్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు , రైతు బాంధవుడు , స్నేహశీలి, ప్రజల మనిషి, రాజకీయ వేత్త  అమరజీవి కీర్తిశేషులు భూతుకూరి పెద్ద వెంకటరెడ్డి  సంతాప సభను విజయవంతం చేయాలని  రామాపురం గ్రామ సర్పంచ్  గుజ్జా అనసూయమ్మ, ఎంపీపీ రామాపురం ఎంపీటీసీ, యాతాకుల జ్యోతి మధుబాబు, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మునగ గోవింద్,సింగిల్ విండో డైరెక్టర్తిపి రెడ్డి చిన్నకోటిరెడ్డి , టిఆర్ఎస్ నాయకులు పొన్నం యేసయ్య లు  సంయుక్తంగా ఒక ప్రకటనలో కోరారు.  ఈ సంతాప సభకు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, టిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కన్నంత రెడ్డి శశిధర్ రెడ్డి , టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని బాబు ,వివిధ హోదాలో ఉన్న టిఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా ,మండల, నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాసంఘాల నాయకులు  , హాజరవుతున్నారని, వారు తెలిపారు...