సోదర భావాన్ని చాటుదాం : సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:01
Let's show brotherhood : Sub-Registrar Taslima Mohammed

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి): ప్రతి ఒక్కరు స్నేవాతత్వాన్ని అలవర్చుకుని,సోదర భావాన్ని చాటాలని ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు.ములుగు జిల్లా కేంద్రంలోని రామాలయం వద్ధ ఏర్పాటు చేసిన దుర్గామాత సన్నిధిలో శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహా అన్నదాన కార్యక్రమం చేసి భక్తులు తస్లీమా అన్నం వడ్డించారు.దుర్గామాత సన్నిధిలో ప్రత్యేకంగా నిర్వహించిన పూజలో తస్లీమా పాల్గొన్నారు.దుర్గామాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రజలు నవరాత్రులు పూజిస్తారని, దేవిమాత సన్నిధిలో ప్రతి ఒక్కరు పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తస్లీమా ఆకాంక్షించారు.పండుగ రోజుల్లోనే కాకుండా ప్రతి రోజు కుల, మతాలకతీతంగా ప్రతి ఒక్కరు సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని తస్లీమా అన్నారు.ప్రజలందరు మాత దుర్గామాతని నవరాత్రి ఉత్సవాలను వేడుకలుగా జరుపుకోవడం అభినందించదగిన విషయమని తస్లీమా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు,భక్తులు,ప్రజలు పాల్గొన్నారు.