"కిసాన్ కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి"

Submitted by Kramakanthreddy on Tue, 20/09/2022 - 16:54
"Kisan Congress should be strengthened"

---వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషిద్దాం
---రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 20 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  కాంగ్రెస్  పార్టీకి అనుబంధమైన కిసాన్  విభాగాన్ని బలోపేతం చేయాలని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కిసాన్ కాంగ్రెస్ విభాగం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ కిసాన్ కాంగ్రెస్ లో  పని చేసే నాయకులకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ విజయంలో కిసాన్ సెల్ విభాగం ముందుండి పని చేయాలని కోరారు. రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ రూపొందించడంలో కిసాన్ కాంగ్రెస్ కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు. , మండల స్థాయిలో కిసాన్ కాంగ్రెస్ ను  మరింతగా 
పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతుబంధు రైతు సమస్యలకు పరిష్కారం కాదన్నారు. ఒక పక్క రైతుబంధు అమలు చేస్తూ, మరో పక్క రైతుల సబ్సిడీ, రాయితీలను ఎత్తివేసారని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సమావేశం లో  డిసిసి అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్, ఉపాధ్యక్షులు సంజీవ్ ముదిిరాజ్, టీపీసీసీ కార్య దర్శులు జీ.మధుసూదన్ రెడ్డి, ప్రదీప్ గౌడ్, మీడియా కన్వీనర్ సీ జే బెనహర్ , మహబూబ్ నగర్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గౌస్, గద్వాల జిల్లా అధ్యక్షుడు నాగరాజు తో పాటు ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.