కస్తూర్భిగాంధీ విద్యార్థులకు దాహం తీర్చిన డిసిసిబి డైరెక్టర్ విరిగినేని అంజయ్య

Submitted by venkat reddy on Tue, 13/09/2022 - 11:01
Kasturbhi Gandhi quenched the thirst of the students Director of DCCB Mr. Anjaiah

నిడమనూరు,సెప్టెంబర్12(ప్రజాజ్యోతి): నిడమనూరు మండలకేంద్ర శివారులోని కస్తూర్భిగాంధీ పాఠశాలలో  మంచినీళ్ల పైపులైను డ్యామేజ్ కావడంతో గత రెండు నెలలుగా కస్తూర్భిగాంధీ పాఠశాల విద్యార్థినిలకు నీళ్లు సరఫరా కాకపోవడంతో విద్యార్థినిలకు ఇబ్బందులు పడుతుండడంతో సోమవారం డిసిసిబి డైరెక్టర్ విరిగినేని అంజయ్య అధ్యాపక బృందం విన్నవించుకోవడంతో తక్షణమే స్పందించి వెంటనే సుమారు రూ.10 వేలు సొంత ఖర్చులతో పైప్ లైన్ మరమ్మతులు చేయించి పాఠశాల విద్యార్థినిల సమస్యలు తీర్చడంతో  విద్యార్థినిల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యార్థినిలు, ఉపాధ్యాయురాలు డిసిసిబి డైరెక్టర్ విరిగిన అంజయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.