ఘనంగా కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు

Submitted by venkat reddy on Tue, 27/09/2022 - 15:44
Kanakadurga Navratri celebrations are grand

నిడమనూరు, సెప్టెంబర్ 26(ప్రజాజ్యోతి)ః  నిడమనూరు మండలకేంద్రంలోని  కనక దుర్గదేవి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. సోమవారం కనకదుర్గ శర నవరాత్రి  ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో  కనక దుర్గ దేవి నవరాత్రి ఉత్సవాలు  ప్రారంభించారు.ఈసందర్భంగా నిడమనూరు కనకదుర్గ ఉత్సవ కమిటీ సభ్యులు జమలుపూరి నర్సింగ్ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని  ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులుపంతులు తుకారం,గౌరు సాయి రాకేష్, సోమవరపు శ్రీను, నాగేశ్వరరావు, లికేష్‌,డి.యశ్వంత్, సందీప్, పవన్, నాగరాజు,సంజయ్, చౌదరి, అరుణ్, శ్యామ్, రోహిత్, చౌదరి, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.