బాధిత కుటుంబానికి 3లక్షల ఎల్ఓసిని అందించిన కడియం శ్రీహరి

Submitted by lenin guduru on Thu, 20/10/2022 - 19:23
కడియం

బాధిత కుటుంబానికి 3లక్షల ఎల్ఓసిని అందించిన కడియం శ్రీహరి

చిల్పూర్,అక్టోబర్ 20,(ప్రజాజ్యోతి)

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.ఈ సందర్భంగా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన ఇల్లందుల మల్లేష్ అనే యువకుడు ఇటీవల గ్రామంలోనీ విద్యుత్  స్తంభంపై నుండి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రగాయాల పాలయ్యాడు. దీంతో అతడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరగా అక్కడి వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు.ఈ విషయం తెలిసిన చిల్పూర్ మండల కడియం యువసేన అధ్యక్షుడు ఇల్లందుల విజయ్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి  దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూపాయలు 3 లక్షల ఎల్ వో సిని మంజూరు చేయించి అట్టి కాపీని గురువారం హనుమకొండలోని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నివాసంలో చిల్పూర్ మండల సర్పంచ్లు ఫోరం అధ్యక్షులు  చిన్న పెండ్యాల గ్రామ సర్పంచ్ మామిడాల లింగారెడ్డి అధ్వర్యలో బాధిత కుటుంబానికి ఎల్ఓసిని అందించారు.ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా,అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా కలిగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బాధితుని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.