సుల్తానాబాద్ సెప్టెంబర్ 03(ప్రజా జ్యోతి) పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులు గా తమ న్యాయమైన డిమాండ్ ల సాధన కోసం రిలే దీక్షలు చేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్లకు ప్రభుత్వం న్యాయం చేయకపోవడం బాధాకరమని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో మధ్యాహ్న భోజన వర్కర్లు లు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి కి కారణం అగ్రవర్ణ పాలనే నని, వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి అండగా ఉంటుందని తెలియజేశారు
ఈకార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా కోఆర్డినేటర్ అంబాల రాజేందర, ఎం ఎస్ పి నియోజకవర్గ ఇన్చార్జి తాండ్ర శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అంబాల నరేష్, మాటూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
- 28 views