- తుంగపాడ్ సర్పంచ్ దండిగా అలివేలు నర్సింహా ఆధ్వర్యంలో
నాంపల్లి, సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి ): నాంపల్లి మండలం తుంగపాడు గ్రామ పంచాయతీ పరిధిలో 10 కుటుంబాల కార్యకర్తలు స్థానిక సర్పంచ్ దండిగ అలివేలు నర్సింహా యాదవ్ ఆధ్వర్యంలో మునుగోడు ఇంచార్జీ మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమాక్షంలో హైదారాబాద్ తన నివాసంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు.అనంతరం టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా వారుమాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పతకాలు రైతు బంధు , రైతు భీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు పథకాలను చూసి ఇతర పార్టీల కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు .ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి ఏవి రెడ్డి,ఎంపిపి ఏడుదొడ్ల శ్వేత రవిందర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ కడారి శ్రీశైలం, దండిగ ఈదయ్య,నేతళ్ళ నరేష్, దండిగ నరేందర్ యాదవ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
- 1 view