బిజెపి ,కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి బారి చేరికలు

Submitted by sudhakar on Fri, 16/09/2022 - 11:49
 Joining of TRS from BJP, Congress

అడ్డగూడూర్ సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి  న్యూస్). స్థానిక అడ్డగూడూరు మండలం పరిధిలోని వెల్దేవి గ్రామంలో కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి పలువురు యువ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తీపిరెడ్డి మెగా రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో  చేరడం జరిగింది. ఈ సందర్భంగా మెగారెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి వచ్చిన వారందరికీ స్వాగతం తెలిపారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టిఆర్ఎస్ పార్టీ ముందుండి వారిని ఆదుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ లో చేరిన  పలువురు నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని, ఎమ్మెల్యే అంటే ఎప్పుడో నెలకు ఒక్కసారి నియోజకవర్గానికి వచ్చే గత ప్రభుత్వాల పరిస్థితుల నుండి అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్నారని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగాకనుమరుగవుతుందని ఆ పార్టీకితెలంగాణలో కానీ దేశంలో కానీ మనుగడ లేదని, బిజెపి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ఇబ్బందులకు గురి చేస్తుందని, రానున్న ఎలక్షన్లలో దేశవ్యాప్తంగా కేసీఆర్ మానియా పనిచేస్తుందని, 2024 ఎలక్షన్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.

తెరాస పార్టీలో చేరిన వారిలో బిజెపి పార్టీ నుండిరొడ్డ బిక్షం,వుడుగు రమేష్,మిట్టగడుపుల యాదగిరి,నీర్మాల సందీప్,నీర్మాల మార్కకాంగ్రెస్ నుండినీర్మల శివకుమార్,నీర్మాల వెంకటయ్య, తదితరులు  చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో మోత్కూర్ మార్కెట్ చైర్మన్ యాకూబ్ రెడ్డి అడ్డగూడూరు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి  మోత్కూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు  రమేష్ సర్పంచ్పిల్లి శ్రీకళ సుందర్,ఉపసర్పంచ్ మంటిపల్లిరామచంద్రు,మాజిసర్పంచ్, తీపిరెడ్డి నాగలక్ష్మి కరుణాకర్ రెడ్డి ,గ్రామశాఖ అధ్యక్షుడు కుంభం సోమయ్య, నాయకులు పిల్లి గంగయ్య, నీర్మాల సైదులు, వుడుగు శ్రీను,నీర్మాల మారయ్య, బొడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు