అచ్చంపేట సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి. బల్మూరు మండలంలోని కొండనాగుల ప్రభుత్వ ఉమామహేశ్వరి డిగ్రీ కళాశాలలో దోస్తు మూడో విడత కౌన్సిలింగ్ లో భాగంగా విద్యార్థులు డిగ్రీ కళాశాలలో చేరాలని ఆ కళాశాల అధ్యాపకులు కరపత్రాలతో బల్మూరు మండలంలోని వివిధ గ్రామాలలో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు కొండనాగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని వసతులు అధ్యాపక బృందం తోపాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయ ని పేద విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో చేరాలని అధ్యాపకులు సూచించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పరంగి రవి జాన్ బాబు లక్ష్మణ్ గౌడ్ చంద్రకాంత్ తదితరులు ఉన్నారు.
- 1 view