మహాదేవపూర్ సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి ; మహాదేవపూర్ మండలంలోని చండుపల్లి, అన్నారం, మద్దులపల్లి, పలుగుల, సూరారం, పెద్ద౦పేట్, రాపెళ్ళికోట, ఎన్కపల్లి గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం చే నూతనంగా జారీ చేసిన ఆసరా పింఛన్లకు సంబంధించి పింఛన్ పత్రాలను పాతవాటిని మరియు కొత్తవాటిని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రాణి బాయి , మరియు ఎంపీడీవో శ్రీ శంకర్, లబ్దిదారులకు అందజేసినారు . వారు మాట్లాడుతూ మహదేవపూర్ మ౦డలములో వృద్దాప్య 717, విత౦తు 80, వికలా౦గుల 21, సి౦గిల్ ఉమన్ 2 మొత్తముగా 820 పి౦చన్లు మ౦జూరి అయినవి అని ఇ౦కనూ అర్హతకలవారు ఎవరైనా ఉ౦టే దరఖాస్తు చేసుకోవాలని కోరినారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు, వార్డు సభ్యులు, ఎంపిటిసి లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
- 1 view