వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి - ఎమ్మెల్యే నోముల భగత్

Submitted by kareem Md on Thu, 15/09/2022 - 10:50
Vajrotsavams should be organized grandly - MLA Nomula Bhagat

ఫోటో రైటప్: సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భగత్
-సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు

హలియా,సెప్టెంబర్14(ప్రజా జ్యోతి) : జాతీయ సమైక్యత కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు.ఈ సందర్భంగా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాట్లపై బుధవారం నాడు  హలియా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న వజ్రోత్సవాలలో నిర్వహించబోయే కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు చేశారు,జన సమీకరణ,భోజన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో స్పెషల్ ఆఫీసర్ రాజ్ కుమార్,నోడల్ ఆఫీసర్ అశ్వక్,జెడ్పిటిసి అబ్బిడి కృష్ణారెడ్డి,ఎంపీపీ బొల్లం జయమ్మ,డీసీసీబీ జిల్లా డైరెక్టర్ విరిగినేని అంజయ్య, పిఎసియస్ చైర్మన్ గుంటక వెంకట్ రెడ్డి,రాష్ట్ర నాయకులు బాబురావునాయక్,మాజీ ఎంపీపీ దూళిపాల రామచంద్రయ్య,జిల్లా నాయకులుమర్ల చంద్రారెడ్డి , పెద్దబోయిన శ్రీనివాస్ యాదవ్,బిక్ష్యా నాయక్,మండలపార్టీ అధ్యక్షులు కురాకుల వెంకటేశ్వర్లు,జటావత్ రవి నాయక్,పిడిగం నాగయ్య, గజ్జెల చెన్నారెడ్డి,పిఎసియస్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు చేరు ముత్యాలు,ఎంపీపీ సలహాదారులు బొల్లం రవి మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్,కౌన్సిలర్లు వర్ర వెంకటరెడ్డి,ప్రసాద్ నాయక్,రెవెన్యూ శాఖ,పోలీస్ శాఖ,మునిసిపల్ శాఖ అధికారులు,ఎంపీడీఓలు, యంఈఓ లు,తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.