చీకటి దందాగా మారిన ఇసుక రవాణా

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 13:19
 A transport of sand that turned dark

తెలకపల్లి,అక్టోబర్ 2(ప్రజాజ్యోతి): ఇసుక అక్రమ రవాణా చీకటి దందాగా మారింది కొంతకాలంగా ఈ ప్రాంతంలో దుందుభి వాగు పరిసరాల నుండి ఇసుక మాఫియా తమ ట్రాక్టర్ల ద్వారా ఇసుక నింపుకొని తెలకపల్లి మీదుగా అతివేగంతో నాగర్ కర్నూల్ తెలకపల్లి తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు ఇసుక అక్రమ రవాణాను ఎంతకు అరికట్టే పరిస్థితి లేకుండా పోతుందని ఆరోపిస్తున్నారు అనుమతుల పేరుతో కొందరు ఇసుక రవాణా చేస్తున్నా చీకటి అయింది అంటే ఇసుక రవాణా జోరు పెరుగుతుంది ఇసుక రవాణా మాఫియాను అధికారులు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లకు నంబర్ ప్లేట్లు లేకుండా అతివేగంతో ప్రయాణిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు మరికొన్ని చోట్ల ఫిల్టర్ ఇసుక దందాలు నిర్వహిస్తున్నారని ప్రజలు తెలుపుతున్నారు ఇప్పటికైనా స్పందించి అనుమతుల సాకుతో ఇసుక రవాణా చేస్తున్న మాఫియాను అరికట్టాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.