తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ విజయవంతం చేయాలి:జెడ్పీ చైర్మన్

Submitted by bosusambashivaraju on Fri, 16/09/2022 - 12:53
Telangana National Integration Vajrotsava rally should be successful: ZP Chairman

చిల్పూర్, సెప్టెంబర్ 15,ప్రజా జ్యోతి. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని జనగాం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం చిల్పూర్ మండల కేంద్రంలోని ఎంఆర్ సి భవన్ నందు ఎంపిపి సరిత  అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ బహిరంగ సభలో భాగంగా  శుక్రవారం స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కేంద్రంలో 15000 మందితో నిర్వహించనున్న భారీ ర్యాలీ, బహిరంగ సభకు చిల్పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో నుండి 2000 మందిని తరలించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని  జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి సూచించారు.ఈ సమావేశంలో ఎమ్మార్వో విమల,  ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఏపీఎం రమేష్, ఏపీవో కిరణ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.