తిరుమలగిరి సెప్టెంబర్ 6 (ప్రజా జ్యోతి) తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన పెసర అరవింద్ రెడ్డి సురేందర్ రెడ్డి అమ్మమ్మ బై రెడ్డి శకుంతలమ్మ మరణించిన విషయం తెలుసుకుని తెలంగాణ ఉద్యమ నాయకులు ఆరాధ్య పౌండేషన్ చైర్ పర్సన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్ధివ దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మెర్సి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఇటికాల చిరంజీవి ఆరాధ్య పౌండేషన్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- 13 views