- ఫోటో రైటప్: క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎమ్మెల్యే నోముల భగత్
- -కబడ్డీ ఆడుతున్న ఎమ్మెల్యే నోముల భగత్.
హలియా,సెప్టెంబర్15(ప్రజా జ్యోతి): విద్య తో పాటు క్రీడలు శారీరక వికాసానికి తోడ్పడతాయి అని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం హాలియా మున్సిపాలిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోతెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్బంగా ఉద్యమకారుల ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ పాఠశాల స్థాయి క్రీడలను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం విద్యార్థులని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యుత్ తో పాటు క్రీడలు మానవుడికి ఎంతో తోడ్పడతాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచి క్రీడలలో మెలకువలు నేర్చుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య,వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, కౌన్సిలర్లు వర్ర వెంకటరెడ్డి, నలబోతు వెంకటయ్య, అన్నపాక శ్రీను,ప్రసాద్ నాయక్, కో ఆప్షన్ సభ్యులు చాపల సైదులు, డోమ్నిక్,షేక్ అన్వరోద్దీన్,రావుల లింగయ్య, పట్టణ అధ్యక్షులు చెరుపల్లి ముత్యాలు,పిఎసిఎస్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి,ఉద్యమకారులు వడ్డే సతీష్ రెడ్డి,గడ్డం సోము, గోపిశెట్టి నరసింహ,గుంటుక మధుసూదన్ రెడ్డి,షేక్ హుస్సేన్, రావుల పాటి యల్లయ్య,షేక్ జావీద్,ముస్తఫా,యడవెల్లి రాంబాబు,పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.