జిల్లా ప్రధాన న్యాయమూర్తి కి శుభాకాంక్షలు తెలిపిన ఎస్.జె.కె అహ్మద్

Submitted by Guguloth veeranna on Sat, 26/11/2022 - 16:13
SJK congratulated the District Chief Justice

పాల్వంచ, నవంబర్ 26, ప్రజాజ్యోతి : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ ను నేతాజీ యువజన సంఘం, జనతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.జె.కె అహ్మద్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ ను నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు ఎస్.జె.కె అహ్మద్ శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సత్కరించారు.