శివాలయంలో కార్తీక పూజలు

Submitted by bathula ravikumar on Mon, 21/11/2022 - 17:10
శివాలయంలో కార్తీక పూజలు

శివాలయంలో కార్తీక పూజలు

సుజాతనగర్ నవంబర్ 21 ప్రజాజ్యోతి 

మండల కేంద్రంలోని ఉత్తర వాహిని నది తీరమున వేంచేసి ఉన్న స్వయంభు శ్రీ సోమేశ్వర స్వామి శివాలయం నందు కార్తీక చివరి సోమవారం సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు చొప్పకట్ల జనార్ధన్ శర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజామునుండే ప్రత్యేక అభిషేకములు నిర్వహించారు భక్తులు దూర ప్రాంతాల నుండి వచ్చి వాగులో స్నానమాచరించి అరటి దోప్పలో కార్తీక దీపాలు వెలిగించారు ఆలయ ఆవరణలోని మర్రిచెట్టు ఉసిరి చెట్టు కింద ప్రమిదలు దీపాలు వెలిగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు శివాలయంలో ఓం నమశ్శివాయ నామస్మరణలతో మార్మోగిపోయింది అనంతరం తీర్థప్రసాదాలు భక్తుల స్వీకరించారు నేడు పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం ఉంటుందని బుధవారం మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందాలని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు