వైయస్సార్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి
హాలియా,సెప్టెంబర్ 02(ప్రజా జ్యోతి): రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపిన మహానీయుడు వైయస్సార్ అని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. శుక్రవారం నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని నాగార్జునసాగర్ హాలియా మున్సిపాలిటీ లో ఘనంగా నిర్వహించారు.
నాగార్జునసాగర్ లోని ఆయన నివాసంలో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపర భగీరధుడు,రైతు బాంధవుడు, ఆరోగ్యశ్రీ ప్రదాత,పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్తాయిగా నిలచిపోయిన మహానీయుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు.
ఉమ్మడి రాష్టంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయంలోనే అనేక బహులార్ధక ప్రాజెక్టులను నిర్మాణంలోకి నేటి ప్రభుత్వం అనుసరిస్తున్నపథకాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినవే అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి,శంకర్ నాయక్, జిల్లా కార్యదర్శి కాకునూరి నారాయణ గౌడ్,కుందూరు వెంకట్ రెడ్డి,పాంపాటి శ్రీనివాసులు,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా రమేష్ యాదవ్,కసిరెడ్డి నరేష్, మజాహర్ మొయినుద్దీన్, వెంపటి శ్రీనివాసులు, తక్కెళ్ళపల్లి సైదులు,సాజిద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
- 1 view