నాగం హయాం లోనే దళితులపై దాడులు ఎంపీపీ కొమ్ము మధు

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 13:08
MPP Kommu Madhu attacked Dalits during Nagam's reign

తెలకపల్లి,సెప్టెంబర్ 26 (ప్రజాజ్యోతి):  దళితులపై దాడులు నాగం హయాంలోనే జరిగాయని ఎంపీపీ కొమ్ము మధు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బంగారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం ఎంపీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఇటీవల మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పై చేస్తున్న అసత్య ఆరోపణలు సమంజసం కాదన్నారు దళితులపై నాగం హయాంలోనే దాడులు జరిగాయి అని అన్నారు తాళ్లపల్లి కి చెందిన దళితుడు బుచ్చయ్య పై దాడి నాగం కుట్రతోనే జరిగిందని అన్నారు ఎన్నోపదవులు అనుభవించిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ప్రజలకు చేసింది శూన్యం అని తెలిపారు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సమంజసం కాదని తెలిపారు కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీ రెడ్డపాకుల రమేష్ ఉప సర్పంచ్ కృష్ణ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సత్యం కార్యదర్శి కోట్ల శ్రీనివాసులు రైతుబంధు అధ్యక్షులు మాధవరెడ్డి ఎంపీటీసీ విజయలక్ష్మి విండో వైస్ చైర్మన్ యాదయ్య నాయకులు సురేష్ చెన్ననరసింహ తదితరులు పాల్గొన్నారు.