మన ఊరు మన బడి ద్వారా జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించిన ఎంపీడీవో

Submitted by Degala Veladri on Thu, 22/09/2022 - 07:33
MPDO inspected the development works being done by Mana Uru Mana Badi

మన ఊరు మన బడి ద్వారా జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించిన ఎంపీడీవో

బోనకల్, సెప్టెంబర్ 21, ప్రజాజ్యోతి:

స్థానిక మండల పరిధిలోగల కలకోట,రాయన్నపేట గ్రామపంచాయతీలను ఎంపీడీఓ బోడెపుడి వేణుమాధవ్ సందర్శించారు.మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించడం జరిగింది.విద్యుత్ పనులు,కిటికీలు,తలుపులు పూర్తయ్యాయని, టాయిలెట్స్ నీటి సరఫరా పనులు పెండింగ్లో ఉన్నాయని తెలియజేశారు, అసంపూర్తిగా ఉన్న పనులను కూడా త్వరలో పూర్తి చేయాలని నిర్మాణ పనులు చేపట్టిన సంబంధిత వారిని ఎంపీడీవో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.