తెలకపల్లి,సెప్టెంబర్ 27 (ప్రజాజ్యోతి): ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావం కలిగి ఉండాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు మండలంలోని తన సొంత గ్రామం గౌరారంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తండ్రి యక్షగాన కళాకారుడు గోరటి నరసింహ ఆరాధన ఉత్సవం సోమవారం రాత్రి నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి భజన కీర్తనలు నిర్వహించారు కార్యక్రమంలో గురువులు ఈశ్వరయ్య హనుమంత్ రెడ్డి బాలపేరు యాదగిరి ఆంజనేయులు కళాకారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
- 2 views