ప్రజా జ్యోతి తిరుమలగిరి టౌన్ ; పసునూరు మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించిన సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ గురువారం క్యాంపు కార్యాలయంలో విద్యార్థులను అభినందించారు. స్టేట్ ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా మోడల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు ర్యాంకులు సాధించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు.
పేద విద్యార్థులకు చదువు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మోడల్ పాఠశాలలు, గురుకులాలను స్థాపించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి దేశభక్తిని కలిగి ఉండాలని, కష్టపడి చదివి, తల్లిదండ్రులకు, గురువులకు దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- 2 views