మద్యం వ్యాపారుల దోపిడిని అరికట్టాలి

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 13:53
 The looting of liquor dealers should be stopped

తెలకపల్లి,సెప్టెంబర్ 23(ప్రజాజ్యోతి) :తెలకపల్లి మండల కేంద్రంలో మద్యం సిండికేట్ వ్యాపారుల దోపిడిని వెంటనే అరికట్టాలని ఎంపిటిసి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు శుక్రవారం ఎంపీటీసీ రమేష్ తదితరులు ఎక్సైజ్ ఎస్సై బాలవర్ధన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం సిండికేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా అధిక ధరలతో దోపిడీకి పాల్పడుతూ దగా చేస్తున్నారని వివరించారు అదేవిధంగా రోడ్డు వెంట ఉన్న మద్యం దుకాణాల వద్ద గొడవలు జరుగుతున్నాయని వాహనాల రాకపోకలకు ప్రమాదకరంగా మారిందని నిరసన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సిండికేట్ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు.